Tuesday, April 30, 2024

పోలీసుల సమయస్ఫూర్తితో తప్పిన పెను ప్రమాదం

అనంతపురం జిల్లా కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నగర పోలీసులు సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానిక మున్సిపల్ కాంప్లెక్స్ లోని రాజ అనే వ్యక్తి రూంలు అద్దెకు తీసుకుని ప్రింట్ అండ్ జిరాక్స్ మరియు కంప్యూటర్ సర్వీసింగ్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఈరోజు ఉన్నట్లుండి ఆ దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సమాచారం అగ్నిమాపక శాఖ , నగర పోలీసు అధికారులకు అందింది. హుటిహుటిన నగర పోలీస్ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. మంటలు ఎగిసి పడుతుండటంతో ఆ దుకాణంలోకి ఎవరు వెళ్లలేని పరిస్థితి ఎదురయ్యింది. ఒకవైపు అగ్నిమాపక శాఖ అధికారులు నీటితో అదుపు చేసే ప్రయత్నం చేసినా మంటలు ఎగిసిపడుతూ సమీప దుకాణాలకు వ్యాపించే అవకాశం నెలకొంది. ఈక్రమంలో టూటౌన్ సి.ఐ జాకీర్ హుస్సేన్ ఆధ్వర్యంలో పోలీసులు ధైర్యంగా దుకాణం లోపలికి వెళ్లి మంటలు ఆర్పివేశారు. సమీప దుకాణాల యజమానులు ఊపిరి పీల్చుకుని పోలీసుల సేవలను కొనియాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement