Friday, April 26, 2024

అనంతపురం జిల్లాలో డ్రగ్స్ కలకలం..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో డ్రగ్స్ కలకలం చోటుచేసుకుంది. డ్రగ్స్ సప్లైపై విచారణ చేపట్టిన అనంతపురం పోలీసులు బెంగళూరులో ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడు నైజీరియాకు చెందిన ఆంటోని శామ్యూల్ గా పోలీసులు గుర్తించారు. అనంతరం నిందితుడి నుంచి ఎనిమిది గ్రాముల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. పీటీ వారెంట్ పై నైజీరియన్ శామ్యూల్ ను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ కేసులో గత నెల 20న ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిచ్చిన సమాచారంతో నైజీరియన్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement