Sunday, April 28, 2024

ఆగి ఉన్న లారీని ఢీ కొన్న బొలెరో – ఒకరు మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

గుంతకల్లు రూరల్, (ప్రభన్యూస్) : అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం నక్కనదొడ్డి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయలయ్యాయి. . 67 వ నెంబరు జాతీయ రహదారి నిర్మాణ పనులు చేస్తున్న ఎస్ ఆర్ కే కన్స్ట్రక్షన్స్ కంపెనీ లో పనిచేస్తున్న అమర్ నాథ్ చౌదరి అనే వ్యక్తి తన సహచర సిబ్బందితో కలిసి బుధవారం తెల్లవారుజామున ఎస్.ఆర్.కె కార్యాలయం వద్ద నుంచి రోడ్డు బ్రిడ్జి పనులు జరుగుతున్న ప్రదేశానికి బొలెరో క్యాంపర్ వాహనంలో వెళ్తుండగా …నక్కనదొడ్డి గ్రామం వద్ద జాతీయ రహదారిపై నిలిపి ఉన్న లారీని వెనుక వైపు నుంచి బలంగా ఢీకొంది. ఈ సంఘటనలో బొలెరో వాహనంలో ప్రయాణిస్తున్న అమర్ నాథ్ చౌదరి(25) జమీర్, బెగల్ మార్ట్ లతో పాటు మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దాంతో స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన చికిత్స నిమిత్తం గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసిన ప్రభుత్వ వైద్యులు గాయపడిన వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తులు మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. గుంతకల్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement