Sunday, April 28, 2024

AP: హిందూపురం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బీకే పార్థసారథి

శ్రీ సత్యసాయి బ్యూరో, మార్చి 22 ప్రభ న్యూస్: శ్రీ సత్యసాయి జిల్లాలో హిందూపురం లోక్ సభ టీడీపీ అభ్యర్థిగా బీకే పార్థసారథిని చేస్తూ టీడీపీ అధిష్టానం శుక్రవారం జాబితాను విడుదల చేసింది. దీంతో గత కొన్ని నెలలుగా ఉత్కంఠలో ఉన్న టీడీపీ శ్రేణులకు ఊరట కలిగించింది.

ముఖ్యంగా బీకే పార్థసారథి అభిమానులు అధిష్టానం నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సందర్భంలో లోకసభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో సైతం టీడీపీకి అదనపు బలం చేకూరిందని అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పెనుకొండ, కదిరి, పుట్టపర్తి నియోజకవర్గంలలో టీడీపీ అభ్యర్థులకు కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement