Thursday, May 2, 2024

AP: ఆటో బోల్తా…. మహిళా ఉపాధ్యాయులకు గాయాలు

అనంతపురం : అనంతపురం నుంచి వెళ్తున్న ఆటో పాల్తూరు సమీపంలో ఇవాళ ఉదయం బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు మహిళా ఉపాధ్యాయులు గాయపడ్డారు. అనంతపురంలో కాపురం ఉంటూ పాల్తూరు పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులు ప్రతి రోజూ పాఠశాలలకు ఆటోల్లో వచ్చి వెళ్తుంటారు.

ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం కూడా పాఠశాలలకు బయలుదేరారు. కాసేపట్లో పాల్తూరు చేరుకుంటారనగా వారు ప్రయాణిస్తున్న ఆటో ప్రమాదవశాత్తు బోల్తా కొట్టడంతో అందరూ బిగ్గరగా కేకలు వేశారు. ఆటోలో నుంచి దూకేసి ప్రాణాలు కాపాడుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement