Sunday, April 28, 2024

IND vs ENG, 4th Test : లంచ్ బ్రేక్… భారత్ స్కోరు 118/3

రాంఛీ: భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు టీమిండియా బ్యాటింగ్ కొనసాగిస్తోంది. ఇవాళ లంచ్ బ్రేక్ సమయానికి భారత్ జట్టు మూడు వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. భారత్ జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే 74 పరుగులు చేయాల్సి ఉంది.

యశస్వి జైస్వాల్ 37 పరుగులు చేసి ఔట్ కాగా, కెప్టెన్ రోహిత్ శర్మ 55 పరుగులు చేసి ఔటయ్యాడు. అలాగే మూడో వికెట్ రజత్ పటిదార్ పరుగులేమీ చేయకుండానే డకౌట్ అయ్యి వెనుదిరిగాడు. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ బ్యాట్స్ మెన్లు శుభమాన్ గిల్ 18 పరుగులు, రవీంద్ర జడేజా మూడు పరుగులతో నాటౌట్ గా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement