Sunday, April 28, 2024

ట్రాన్స్ జెండర్ పై దాడి – స్పందించ‌ని పోలీసులు

అనంతపురం కార్పొరేషన్, ఫిబ్రవరి 28 (ప్రభ న్యూస్) : అనంతలో ట్రాన్స్ జెండర్ పై దాడి జరిగిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు… అనంతపురంలో ట్రాన్స్ జెండర్ల‌లో రెండు గ్రూపులు కలవు. ఆసిఫ్ ఆధ్వర్యంలో ఒక వర్గం మయూరి ఆధ్వర్యంలో ఒక వర్గం ఉన్నాయి. రెండు రోజుల క్రితం మయూరి గ్రూపున‌కు చెందిన ఒక ట్రాన్స్ జెండర్ ఉమెరా పై ఒక వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. బాధితులు బికేస్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు స్పందించలేదని, ఎస్పీకి ఫిర్యాదు చేస్తామ‌ని బాధితులు ప్రెస్ క్లబ్ లో తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement