Friday, March 29, 2024

175 సీట్లలో గెలిచే దమ్ముందా.. చంద్ర‌బాబు, ప‌వ‌న్ కు జ‌గ‌న్ స‌వాల్..

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల‌కు రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌వాల్ విసిరారు. దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లో పోటీ చేయాలి.. 175 స్థానాల్లో పోటీచేసి గెలిచే ధైర్యం ఉందా ? అంటూ ఓ రేంజ్‌ లో సవాల్‌ చేశారు సీఎం వైఎస్‌ జగన్‌. గుంటూరు జిల్లా తెనాలి నుంచి రైతుల ఖాతాల్లో న‌గ‌దు జ‌మ చేశారు. ఈసంద‌ర్భంగా నిర్వ‌హించిన స‌భ‌లో సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ… చంద్రబాబుపై సీఎం జగన్ హాట్‌ కామెంట్స్‌ చేశారు.

కరువుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అని… చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కరువు కచ్చితంగా వస్తుందని తెలిపారు. గతంలో వైఎస్సార్ పాలన లో కూడా సమృద్ది గా వర్షాలు పడేవి… రైతులు సుభిక్షంగా ఉన్నారని… మంచి మనసుతో పరిపాలన చేస్తే దేవుడు కూడా కరుణిస్తాడని చురకలు అంటించారు. కుప్పంతో సహా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగాయని…2014 నుండి 19 వరకు కరువు తాండవించేదన్నారు జగన్. మ‌న‌ది రైత‌న్న‌ల ప్ర‌భుత్వ‌మ‌ని, చంద్ర‌బాబుది పెత్తందారుల పార్టీ అని జ‌గ‌న్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement