Tuesday, May 7, 2024

తాడిపత్రి వద్ద ఘోరం, చెట్టును ఢీ కొన్న కారు.. ము గ్గురు మృతి

తాడిపత్రి: తాడిపత్రి-అనంతపురం మార్గంలోని రావివెంకటాంపల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు చెట్టును ఢీకొన్న ఘటనలో ముగ్గురు మరణించగా, మరొకరు గాయపడ్డారు. తాడిపత్రికి చెందిన మోహన్ రెడ్డి కారు అతి వేగంతో వచ్చి గ్రామంలోని ఓ మలుపులో రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొని బోల్తా పడింది. ప్రమాదంలో కారులో ఉన్న నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా, శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తికి గాయాలయ్యాయి.

కారు కొని..పార్టీ చేసుకొని..
మోహన్ రెడ్డి సెకండ్ హ్యాండ్ కారును నిన్న కొనుగోలు చేశాడు. దీంతో తన స్నేహితులతో కలిసి రావికటాంపల్లి సమీపంలో రాత్రి పార్టీ చేసుకున్నట్లు తెలిసింది. ఆ సమయంలో వారు ఫుల్లుగా తాగినట్లు తెలిసింది. తన ముగ్గురు స్నేహితులకు మందు పార్టీ ఇచ్చి, మద్యం మత్తులో అందరూ తాడిపత్రికి తిరిగి కారులో వస్తూ ఉండగా, ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు పోలీసులు తెలపాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement