Sunday, April 28, 2024

అనంతపురం జిల్లాలో.. అనుమానాస్పద స్థితిలో ఎలుగుబంటి మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఎలుగుబంటి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. జిల్లాలోని కళ్యాణదుర్గం మున్సిపల్ పరిధిలోని ముదిగల్లు సమీపంలో ఎలుగుబంటి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. గమనించిన గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు మృతి చెందిన ఎలుగుబంటిని పరిశీలించారు. విషపూరిత ఆహారం తినడం వల్లే ఎలుగుబంటి మృతి చెంది ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement