Tuesday, May 21, 2024

ప్రజా తీర్పు శిరోధార్యం ప్రజలే మా దేవుళ్ళు ఎమ్మెల్యే కేతిరెడ్డి

ధర్మవరం అర్బన్ (- ప్రజా తీర్పు శిరోధార్యం అని ప్రజలే మా దేవుళ్ళని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తన నివాసంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అఖండ మెజారిటీని అందించారని. దీంతో తమా పై మరింత బాధ్యత పెరిగిందన్నారు. ప్రత్యేకించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో ఎక్కడ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొనలేదని, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తన ఎన్నికల ప్రచారంలో ఏ ప్రాంతంలో ప్రచారం చేసిన ప్రాంతాల వారిగా ప్రజలను రెచ్చగొట్టి విధ్వంసాలకు కారణం అవుతున్నారని. అయితే ప్రజలు సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు బ్రహ్మరథం పట్టారని అందుకు ఉదాహరణ ఎన్నికల ఫలితాలు అన్నారు. కాగా ధర్మవరం మున్సిపాలిటీ ఏర్పడిన నాటి నుంచి ఇంతవరకు ఏ పార్టీకి రాని స్పష్టమైన మెజారిటీ ని ఓటర్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అందించారని దీంతో మాపై మరింత బాధ్యత పెరిగింది అన్నారు. తాను నిర్వహించే ప్రతి కార్యక్రమంలోనూ కౌన్సిలర్ల భాగస్వామ్యంతో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. ధర్మవరం మున్సిపాలిటీలోని 40 వార్డుల్లో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన ప్రతి నాయకునికి కార్యకర్తకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement