Monday, April 29, 2024

అనంతలో మంత్రి బొత్స బిజిబిజీ

అనంతపురం – రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అనంత జిల్లాకు విచ్చేశారు. అనంత‌రం నగరంలోని ఎమ్మెల్యే వెంకట్రాంరెడ్డి స్వగృహం నందు ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన కార్పొరేటర్స్ అభ్యర్థులతో సమావేశమయ్యారు. మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక పై చ‌ర్చించారు.. కాగా, నగర మేయర్‌గా మహమ్మద్ వసీం సలీం , డిప్యూటీ మేయర్‌‌లుగా మహాలక్ష్మి శ్రీనివాస్, కోగటం విజయభాస్కరరెడ్డి పేర్లు ఖరారు అయ్యే అవకాశం ఉంది. మేయర్, డిప్యూటీ మేయర్ల పేర్లను ఇంఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ మరికొద్ది సేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు. అలాగే జిల్లాలోని ఇత‌ర మునిసిపాలిటీల‌లో ఛైర్మ‌న్, వైస్ ఛైర్మ‌న్ ల అభ్య‌ర్ధిత్వాల‌పై ఆయా ప్రాంతాల ఇన్ ఛార్జీల‌తో కూడా బొత్స స‌మావేశ‌మ‌య్యారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement