Friday, March 29, 2024

ఏప్రిల్‌ 3..కబడ్డీ టోర్నమెంట్

వేములవాడ: కబడ్డీ ప్రేమికుడు కీ. శే ఎడపల్లి లక్ష్మణ్‌ జ్ఞాపకార్థం ఏప్రిల్‌ 3, 4 తేదీల్లో ఆయన స్వస్థలం చెక్కపల్లిలో ఉమ్మడి కరీంనగర్‌ గ్రామీణ జిల్లాస్థాయి కబడ్డీ టోర్నమెంట్‌ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు, సర్పంచ్‌ అడ్డిక జైపాల్‌రెడ్డి, క్లబ్‌ అధ్యక్షుడు వంగ వంశీ, సభ్యులు హైమద్‌, సత్యం, పరశరాములు, మహేశ్‌, బి.రాజు, దుర్గయ్య, క్రాంతి, ధనంలు తెలిపారు. ప్రథమ బహుమతి రూ. 20వేలు, ద్వితీయ రూ. 15వేలు, తృతీయ రూ. 10వేలు, చతుర్థ రూ. 5వేల బహుమతులు అందిస్తామని వివరించారు. క్రీడాకారులకు భోజనం బస సౌకర్యం ఉంటుందని, ఏప్రిల్‌ 2లోగా జట్ల పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 8465995991, 7672099529, 6309400105, 9603060420 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement