Friday, April 26, 2024

అమరావతి మహోద్యమం @ 700

ఏపీకి అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన మహోద్యమం 700వ రోజుకు చేరింది. మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లు రద్దుకు నిరసనగా రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర నేటితో 16వ రోజుకు చేరింది. పాదయాత్రలో భాగంగా నేడు రైతులు పలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ప్రకాశం జిల్లాలోని విక్కిరాలపేట నుంచి కందుకూరు వరకు సాగనుంది.

కాగా, అమరావతి రైతుల మహాపాదయాత్ర 15వ రోజైన సోమవారం ఉదయం ప్రకాశం జిల్లాలో ఎం.నిడమనూరులో ప్రారంభమై..కె.ఉప్పలపాడు, చిర్రికూరపాడు మీదుగా 15 కిలోమీటర్లు సాగి సాయంత్రం కందుకూరు మండలం విక్కిరాలపేటలో ముగిసింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement