Wednesday, May 8, 2024

మరో పదేళ్లు ఆయనే సీఎం.. అప్పుడే స్వర్ణాంధ్ర సాధ్యం: నటుడు సుమన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సినీ నటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌ జగన్‌ మరో రెండు సార్లు సీఎంగా కొనసాగితే రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మారుతుందని అన్నారు. మూడు దఫాలు ముఖ్యమంత్రిగా ఒకరే ఉండేలా ప్రజలు అవకాశం ఇస్తే అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం విజయవాడలోని జవహర్‌ ఆటోనగర్‌లో ఓ ప్రైవేట్‌ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీలేదని, వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం నవరత్నాల పథకాలతో పేదల్లో చిరునవ్వును నింపిందని చెప్పారు.

ఇక, సినిమా టికెట్‌ ధరలపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తామంతా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. సినిమా పరిశ్రమ బాగుండాలని ప్రభుత్వం సాధ్యమైనంత ఎక్కువే చేసిందని సుమన్‌ అన్నారు. బయ్యర్లు బాగుంటే సినిమా ఇండస్ట్రీ బాగుంటుందని చెప్పారు. సినిమాల్లోకి వెళ్లాలని ఓ మెకానిక్‌ సలహా ఇవ్వడంతోనే తాను ఈ రంగానికి వచ్చానని, అందుకే మెకానిక్‌లంటే తనకు అభిమానమని తెలిపారు. ఆటోనగర్‌కు చెందిన అబ్దుల్‌ కలాం తన మంచి మిత్రుడని సమన్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement