Monday, May 6, 2024

కార్య‌క‌ర్త‌లూ… అప్ర‌మ‌త్తంగా ఉండండి.. ప‌వ‌న్ క‌ళ్యాణ్

కార్య‌క‌ర్త‌లూ… అప్ర‌మ‌త్తంగా ఉండండ‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా శ్రేయస్సు కోసం మనం శ్రమిస్తున్న తరుణంలో మన దృష్టి మళ్లించడానికి, మన భావజాలాన్ని కలుషితం చేయడానికి కొన్ని శక్తులు నిరంతరం పనిచేస్తున్నాయన్నారు. వాటిని అర్థం చేసుకుని పార్టీ నాయకులు, శ్రేణులు ముందుకు వెళ్ళవలసి ఉందన్నారు. మనకు సానుకూలంగా ఉన్న రాజకీయ పక్షాలు, నాయకులకు మన పార్టీ పట్ల ఉన్న సానుకూల దృక్పథాన్ని దెబ్బతీసే కల్పిత సమాచారాన్ని మన శ్రేణులకు చేర్చే కుట్రలకు పాల్పడుతున్నట్లు మన వద్ద విశ్వసనీయ సమాచారం ఉందన్నారు. అందువల్ల పార్టీలోని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. తీవ్రమైన ప్రతి విమర్శలు, తీవ్రమైన ఆర్థిక నేరాల గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు ముందుగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ దృష్టికి తీసుకువెళ్ళండని సూచించారు. వారి సూచనలు, సలహా మేరకు మీరు మాట్లాడండి. పార్టీలోని నాయకులు, వీర మహిళలు, జన సైనికులు మాట్లాడే ప్రతిమాట పార్టీపై ప్రభావం చూపుతుందన్నారు. కనుక సదా అప్రమత్తంగా ఉండాలన్నారు. మాట్లాడే ముందు వాస్తవాలు నిర్ధారించుకోవాలన్నారు.

స్థాయి, తీవ్రత హద్దులు దాటినట్లు సభ్య సమాజం భావించని విధంగా మన మాటలు ఉండాలన్నారు. ఒక వ్యక్తి గురించి మాట్లాడే సమయంలో అకారణంగా వారి కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావించవద్దన్నారు. ఆధారాలు లేకుండా నేరారోపణలు చేయకండన్నారు. అది పార్టీకి, సమాజానికి కూడా హితం కాదన్నారు. నన్ను విమర్శించే వారికీ, వ్యక్తిగతంగా దూషించే వారికి బదులు చెప్పే సమయంలో నేను చాలా అప్రమత్తంగా ఉంటానన్న సంగతి మీ అందరికీ తెలిసిందేన‌న్నారు. ప్రతి అక్షరాన్ని, ప్రతి మాటను బేరీజు వేసుకుంటూ హద్దులు దాటకుండానే కొంత తగ్గి బదులు చెబుతానన్నారు. ఎందుకంటే మన నుంచి వచ్చే ప్రతీ మాటకు అంత బలం ఉంటుందన్నారు. ఆ బలం అపసవ్యంగా మారకూడదు. నేనంటే ఇష్టంలేని వారికి కూడా శుభ సమయాలలో వారికి మంచి జరగాలని ఆకాంక్షిస్తూ ప్రకటన చేస్తుంటాను కదా! ఇలా చేయడం అంటే సమాజంలో సమతుల్యత, సృహుద్భావం నెలకొనాలనే అన్నారు.
ముఖ్యంగా ఈ విషయాలను మరిచిపోకండి….

  1. సరైన ధ్రువపత్రాలు లేకుండా ఎవరిపైనా ఆర్థిక నేరారోపణలు చేయకండి.
  2. కేవలం మీడియాలో వచ్చిందనో లేదా ఎవరో మాట్లాడారనో నిర్ధారణ కానీ అంశాల గురించి మాట్లాడకండి.
  3. పొత్తుల గురించి సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారం ఆధారంగా మాట్లాడకండి. ఈ విషయంలో మేలు చేసే
    నిర్ణయం నేనే స్వయంగా తీసుకుంటా.
  4. మనతో సయోధ్యగా ఉన్న రాజకీయ పక్షాలలో చిన్న చితక నాయకులు మనపై ఏమైనా విమర్శలు చేస్తే ఆ విమర్శలు ఆ నాయకుని వ్యక్తిగతమైన విమర్శలుగా భావించండి. వాటిని ఆయా పార్టీలకు ఆపాదించవద్దని ప‌వ‌న్ క‌ళ్యాణ్ సూచించారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement