Sunday, May 19, 2024

Accident – 108 వాహనం అలస్యంతో గాలిలో కలసిన ప్రాణం

మనుబోలు జూన్ 27 (ప్రభన్యూస్) మోటా రుసైకిలు బోల్తా పడి, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.108 వాహనం ఆలస్యంగా రావడంతో ఒకరు మృతి చెందినాడు. ఈ సం ఘటన మండల పరిధిలో మనుబోలు బైపాస్ కూడలి వద్ద మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.స్థానికుల కథనం మేర కు. సైదాపురం మండలం చీకవోలు గ్రామానీకి చెందిన రాపూరు శ్రీనివాసులు(50) సద్గురు రెడ్డిలు కలిసి మోటారుసైకి లు పై మనుబోలులో బాకీ వసూవులు కోసం వచ్చి, తిరిగి వెళ్తుండగా బైపాస్ రోడ్డు జంక్షన్ వద్ద మోటారుసైకిల్ అదుపుతప్పి పడిపోవడంతో ఇద్దరుకు తీవ్ర గాయాలైనవి. స్థానికులు 108కి సమాచారం ఇవ్వగా ఘటన స్థలానికి 108 వాహనం ఆలస్యంగా చేరుకుంది.

దీనితో తీవ్ర రక్తస్రావమై అప్పటికే శ్రీనివాసులు మృతి చెందాడు. ఎస్సై ముత్యాలరావు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం గూడూరు ఏరియా హాస్పిటల్ కి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement