Wednesday, May 15, 2024

ACB Case – లంచం కేసులో సీనియర్ అసిస్టెంట్ కు మూడేళ్లు జైలు శిక్ష….

క‌ర్నూలు (ఓర్వకల్లు) – కర్నూలు జిల్లా ఓర్వకల్ మండల పరిషత్ కార్యాలయంలో2018లో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న అబ్దుల్ రజాక్ కు ఏసీబీ కేసులో మూడేళ్లు జైలు శిక్ష,రూ.45000 జరిమానా విధించారు. కొంతలపాడు గ్రామానికి చెందిన తిరుమలేష్ 2018 లో రుణం కోసంఎస్సీ కార్పొరేషన్ కి దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తు పంపియాలంటే రూ.20వేలు ఇవ్వాలని రజాక్ డిమాండ్ చేశాడు.

తిరుమలేష్ రజాక్ కు రూ.10వేలు ఇచ్చిన ఇంకా పదివేలు కావాలని ఒత్తిడి చేశాడు. దీంతో తిరుమలేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. తిరుమలేష్ రజాక్ కు రూ.10,000 లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నేరం రుజువు కావడంతో సీనియర్ అసిస్టెంట్ రజాక్ కు మూడేళ్లు జైలు శిక్ష,రూ.45వేలు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement