Saturday, May 18, 2024

AP | రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి.. నెల్లూరు జిల్లాలో ఘ‌ట‌న‌

ముత్తుకూరు ( ప్రభ న్యూస్) : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం సర్వేపల్లి నియోజకవర్గం కృష్ణపట్నం పోర్టు రోడ్డులో ఈరోజు (ఆదివారం) సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కృష్ణపట్నం గ్రామానికి చెందిన బొనిగి శీనయ్య దంపతులు ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా ఆ సమయంలో వెనుక వైపున వస్తున్న ఓ వాహనం ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో అతని భార్య సుహాసిని (30) అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న కృష్ణపట్నం పోర్టు పోలీసులు ఘటన స్థలం చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఏమిటో సేకరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement