Saturday, April 27, 2024

Big Breaking | కర్నాటకలో లారీని ఢీకొన్న జీపు.. అయిదుగురు మృతి

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవ్వాల (మంగళవారం) ఉదయం యాద్గిర్​ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఆగి ఉన్న లారీని జీపు ఢీకొట్టడంతో అయిదుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా నంద్యాల జిల్లా వెలుగోడుకు చెందిన వారిగా గుర్తించారు.

కలబుర్గిలో దర్గా ఉర్సుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. వాహనంలో 18 మంది ఉండగా.. వీరిలో అయిదుగురు చనిపోయారు. 13 మందికి గాయాలయ్యాయి. చనిపోయిన వారిలో మునీర్​ (40), నయామత్​ (40), రమీజా బేగం (50), ముద్దత్​ షీర్​ (12), సుమ్మి (13) గా గుర్తించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement