Friday, May 10, 2024

సీఎం ను దూషించారని మాజీ మంత్రి అయ్యన్న పై కేసు నమోదు

ముఖ్యమంత్రి జగన్ ను దూషించారనే ఫిర్యాదు ఆధారంగా నల్లజర్ల పోలీసులు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదు చేశారు. నల్లజర్లలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ తర్వాత నిర్వహించిన సభలో జగన్ ను దూషిస్తూ అయ్యన్నపాత్రుడు మాట్లాడారని వైసీపీ నేత రామకృష్ణ‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అయ్యన్నపై ఐపీసీ సెక్షన్లు 153 ఏ, 505 (2), 506 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే గతంలో కూడా అయ్యన్నపై ఒక పోలీసు కేసు నమోదైన విష‌యం విదిత‌మే. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ వర్ధంతి సభలో ఆయన వ్యాఖ్యలపై కేసు నమోదు చేశారు. రాష్ట్ర హోంమంత్రి సుచరితను దూషించారంటూ న్యాయవాది వేముల ప్రసాద్ ఆయనపై ఫిర్యాదు చేయ‌డంతో గతంలో కేసు న‌మోదైన విష‌యం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement