Thursday, May 2, 2024

ఏపీలో భారీగా తగ్గిన కరోనా… కొత్తగా 878 మందికి పాజిటివ్

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. వెయ్యి లోపే కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 41,173 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 878 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వైరస్ తో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.  ఇప్పటి వరుకు మొత్తం కేసుల సంఖ్య 20,13,001కి చేరింది. రాష్ట్రంలో కరోనా నుంచి 1,182 మంది బాధితులు కోలుకోగా.. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 19,84,301కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,862 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు మొత్తం 13,838 మంది మరణించారు. కాగా, టెస్టుల సంఖ్య తగ్గడంతో కేసులు కూడా తగ్గినట్లు తెలుస్తోంది.

జిల్లా వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు చూస్తే.. అనంతపురంలో 2, చిత్తూరులో 255, తూర్పుగోదావరి జిల్లాలో 166, గుంటూరు జిల్లాలో 85, కడప జిల్లాలో 67, కృష్ణాజిల్లాలో 42, కర్నూలు జిల్లాలో 03, నెల్లూరు జిల్లాలో 61, ప్రకాశం జిల్లాలో 96, శ్రీకాకుళం జిల్లాలో 24, విశాఖపట్నం జిల్లాలో 50, విజయనగరం జిల్లాలో 04, పశ్చిమగోదావరి జిల్లాలో 23 పాజిటివ్ కేసులు మోదయ్యాయి.

ఇది కూడా చదవండిః కోరలు చాస్తున్న కరోనా… బయటకొచ్చిన మరో కొత్త రకం వేరియంట్

Advertisement

తాజా వార్తలు

Advertisement