Saturday, April 27, 2024

కారు-లారీ ఢీ.. ఇద్దరు మృతి

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం మిట్టమీదిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతినటంతో కారులోనే రెండు మృతదేహాలు ఇరుక్కుపోయాయి. మృతులు మార్కాపురంవాసులుగా తెలిసింది. కంభం నుంచి మార్కాపురం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: గుంటూరు ఘటనపై సీఎం ఆరా.. బాధిత కుటుంబానికి రూ.10లక్షల పరిహారం

Advertisement

తాజా వార్తలు

Advertisement