Friday, May 10, 2024

పాదచారులపై దూసుకెళ్లిన కారు…ఇద్దరు మృతి

అనంతపురంజిల్లాలోని పెద్దవడుగూరు మండలం మిడుతూరులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఓ కారు.. రోడ్డుపై వెళ్తున్న పాదచారులపై దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మిడుతూరు వాసులు నారాయణ, యాకుబ్‌గా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement