Saturday, April 27, 2024

శ్రీ గంధం కేసులో కీలక నిందితులు అరెస్టు

పెనుకొండ ఫారెస్ట్ ఆఫీస్లో శ్రీగంధం చెక్కల చోరీ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు  చేశారు. వీరి నుండీ రూ. 16 లక్షల విలువ చేసే శ్రీగంధం ఆయిల్ , 14 సంచుల శ్రీగంధం చెక్కలు, 4 సెల్ ఫోన్లు, రూ. 2,600 నగదు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 27 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

ఈ ఏడాది జనవరి 24న ఇదే కేసులో ఏడుగుర్ని అరెస్టు చేసి 68 సంచుల శ్రీగంధం చెక్కులు, రెండు ఐచర్ లారీలు, కారు, 3 కార్లు స్వాధీనం చేసుకున్నారు. పెనుకొండ ఫారెస్టు ఆఫీస్ లో చోరీ అయిన 92 శ్రీగంధం చెక్కుల సంచులు, శ్రీగంధం ఆయిల్ కేసులో తాజాగా స్వాధీనం చేసుకున్న వాటితో కలిపి 82 సంచుల శ్రీగంధం చెక్కలు, శ్రీగంధం ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పెనుకొండ డీఎస్పీ ఎన్ రమ్య వివరాలు వెల్లిడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement