Monday, April 29, 2024

తిరుపతి జిల్లాలో బస్సు బోల్తా.. 15మందికి గాయాలు

లారీని తప్పించబోయి బస్సు బోల్తాపడడంతో 15మందికి గాయాలైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని చంద్రగిరి మండలం కొంగరవారిపల్లిలో లారీని తప్పించబోయి బస్సు మామిడితోటలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 15మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి పోలీసులు తరలించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement