Sunday, April 14, 2024

‘జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష’ రైతులకు మేలు : జేసీ కూర్మనాథ్‌

ముత్తుకూరు, ఏప్రిల్ 18 (ప్రభ న్యూస్) : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు-భూ రక్షా పథకం రైతులకు చాలా ప్రయోజనం లాంటిదని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ కూర్మ నాథ్ అన్నారు. జిల్లా పరిధి ముత్తుకూరు మండలం రీ సర్వే గ్రామాలైన వల్లూరు, మల్లూరు గ్రామ పంచాయతిల్లో మంగళవారం హద్దురాళ్ళు నాటే ప్రక్రియ జరిగింది. భూమి కొలతల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జెసి పరిశీలించారు. జిల్లాస్థాయి అధికారులతో ఆయన మాట్లాడటం జరిగింది. అదేవిధంగా మల్లూరు గ్రామ సచివాలయంను జేసీ సందర్శించారు. అక్కడ రికార్డులు పరిశీలించి సచివాలయం డిడిఓ మల్లికార్జున రావు పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement