Thursday, May 2, 2024

1.17 కోట్ల విలువైన ట‌న్ను గంజాయి ద‌హ‌నం..

తిరుపతి సిటీ, (ప్రభ న్యూస్): వివిధ కేసుల్లో పట్టుబడిన రూ.1.17 కోట్ల విలువ గల 1174 కిలోల‌ గంజాయిని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తిరుప‌తి జిల్లా గాజులమండ్యం శివారులో సోమవారం ద‌హ‌నం చేశారు. తిరుప‌తి జిల్లా వ్యాప్తంగా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపుతామ‌ని పోలీసులు హెచ్చ‌రించారు. పోలీస్ స్టేషన్లు తిరుమల. తిరుపతి అర్బన్.

తిరుపతి రూరల్ , శ్రీకాళహస్తి, సత్యవేడు, పుత్తూరు, పాకాల. గూడూరు, వాకాడు, సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి, బి. వి. పాలెం చెక్ పోస్ట్ పరిధిలో సుమారు రూ.1.17 కోట్ల విలువ గల 1174 కేజీల గంజాయిని డ్రగ్ డిస్పోజబుల్ కమిటీ ఆదేశాల ప్రకారం దాహనం చేసిన‌ట్టు స్టేట్ జాయింట్ డైరెక్టర్ రాజేంద్ర తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement