Friday, May 3, 2024

కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌లోనూ ఏక‌గ్రీవాలు – తేల్చ‌సిన విజ‌య‌సాయి రెడ్డి..

విశాఖ: పంచాయితీ ఎన్నిక‌ల‌లో జ‌రిగిన విధంగానే మున్సిప‌ల్, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌లోనూ ఏక‌గ్రీవాలుంటాయ‌ని తేల్చి చెప్పారు వైసిపి జాతీయ కార్య‌ద‌ర్శి, ఎంపి విజ‌య‌సాయి రెడ్డి. విశాఖ నగరంలోని 14వ డివిజన్‌ టీడీపీ కార్పొరేటర్‌ అభ్యర్థి భాస్కర్‌ రాజు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సమక్షంలో బాక్సర్‌ రాజు వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, చాలా మంది టీడీపీ నేతలు వైయస్‌ఆర్‌సీపీ వైపు చూస్తున్నారని, త్వరలోనే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఖాళీ అవుతుందని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement