Saturday, April 20, 2024

హైదరాబాద్ : తెలంగాణలో రేపటి నుంచి 6,7,8 తరగతులు ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి 6,7,8 తరగతుల విద్యార్థులకు  పాఠశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. పాఠశాలల్లో కోవిడ్ జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. అలాగే విద్యార్థులు పాఠశాలకు రావాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పని సరి అని విద్యాశాఖ ఆ ఆదేశాలలో స్పష్టం చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో 9, 10 విద్యార్థులకు పాఠశాలల్లో బోధన ప్రారంభమైన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement