Tuesday, May 14, 2024

సినిమా పరిశ్రమ పాపాలను క‌డిగిన చిత్రం ది కాశ్మీర్ ఫైల్స్ – హీరోయిన్ ‘కంగ‌నా’

ది కాశ్మీర్ ఫైల్స్ చ‌క్క‌ని సినిమాని తీశార‌ని చిత్ర యూనిట్ టీమ్ కు బాలీవుడ్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ అభినంద‌న‌లు చెప్పారు.
వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కశ్మీరీ పండిట్లపై జరిగిన దారుణాలను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అనుపమ్ ఖేర్, మిధున్ చక్రవర్తి, నటి, నిర్మాత పల్లవి జోషి నటించిన ఈసినిమా ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో హాట్ టాపిక్ అవుతోంది. ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. కంగనా రనౌత్ సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు. కాశ్మీర్ పైల్స్ తెరకెక్కించిన టీమ్ కు చాలా అభినందనలు. సినిమా పరిశ్రమ పాపాలను వారు కడిగేశారు. ముఖ్యంగా బాలీవుడ్ చేసిన పాపాలను కూడా ప్రక్షాళించారు. ఎంతో గొప్ప సినిమాను తీశారు. పరిశ్రమలో ఎలుకల్లా దాగిన వారు బయటకు వచ్చి ఈ సినిమాను ప్రోత్సహించాలి అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement