Friday, May 17, 2024

ఓవర్‌హెడ్‌ వాటర్‌ స్టోరేజీ ట్యాంక్‌లను తయారుచేసిన ట్రూఫ్లో బై హింద్‌వేర్‌

భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్లాస్టిక్‌ పైపులు, ఫిట్టింగ్స్‌ బ్రాండ్‌ ట్రూఫ్లో బై హింద్‌వేర్‌ ఈరోజు తమ తెలంగాణా ప్లాంట్‌ నుంచి ఓవర్‌హెడ్‌ వాటర్‌ స్టోరేజీ ట్యాంక్‌లను తయారు చేస్తున్నట్లు వెల్లడించింది. తద్వారా దక్షిణ భారతదేశపు మార్కెట్‌ అవసరాలను తీర్చనుంది. తెలంగాణాలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ట్రూఫ్లో పైప్స్‌ సీఈవో రాజేష్‌ పజ్నూ మాట్లాడుతూ… అతి స్వల్పకాలంలోనే, ట్రూ ఫ్లో బై హింద్‌వేర్‌ పరిశ్రమలోనూతన బెంచ్‌మార్క్‌లను సృష్టించిందన్నారు. తెలంగాణాలోని త‌మ తయారీ కేంద్రం వద్ద వాటర్‌ ట్యాంకులను తయారు చేస్తుండటం పట్ల తాము పూర్తి సంతోషంగా ఉన్నామన్నారు. త‌మ ఉత్పత్తులను పూర్తి నాణ్యతతో పరిశ్రమ ప్రమాణాలకు అనుగుణంగా అత్యంత కఠినమైన తయారీ పద్ధతులను అనుసరించి తయారుచేశామన్నారు. ఉత్తరాది మార్కెట్ల‌లో విజయవంతంగా ఆవిష్కరించిన తరువాత, త‌మ‌ వినియోగదారులు ఏం కోరుకుంటున్నారో తాము అర్థం చేసుకోగలిగామన్నారు. ఈ కారణం చేతనే తాము దక్షిణాది మార్కెట్‌లో త‌మ వినియోగదారుల అవసరాలను సమూలంగా తీర్చగలిగామన్నారు. త‌మ నైపుణ్యంతో పాటుగా త‌మ శక్తివంతమైన తయారీ సామర్థ్యాలు అత్యంత కీలకమైన పాత్రను పోషించడంతో పాటుగా త‌మ మార్కెట్‌ ఉనికికి బలోపేతం చేస్తుందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement