Sunday, May 5, 2024

Pawan Kalyan | ఈ నెల 27న అమిత్ షాతో ప‌వ‌న్ క‌ల్యాణ్ భేటీ

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. ఈ నెల 27న అమిత్ షాను కలవనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గురించి ఈ భేటీలో ఇరువురు నేతలు చర్చించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని ఇప్పటికే పవన్ ను బీజేపీ కోరింది. మరోవైపు తెలంగాణలో కొన్ని స్థానాల్లో పోటీ చేయాలనే పట్టుదలతో జనసేన ఉంది. ఈ నేపథ్యంలో అమిత్ షాతో పవన్ భేటీ కీలకం కాబోతోంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో టిడిపి జనసేన కూటమితో కలిసి రావాలని అమిత్ షా ను పవన్ కళ్యాణ్ కొరనునట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement