Monday, May 20, 2024

Liquor Scame – కవితపై ఈ డి ఛార్జిషీటు దాఖలు

ఢిల్లీ ఎక్సైజ్ పా లసీ లింక్డ్ మనీలాండరింగ్ కేసులో బీఆర్‌ఎస్ నాయకురాలు కె.కవితను నిందితురాలిగా పేర్కొంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం తాజా ఛార్జిషీటును దాఖలు చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ కేసులో కవిత ను మార్చి 15న అరెస్టు చేసారు

. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ) నిబంధనల ప్రకారం ప్రాసిక్యూషన్ ఫిర్యాదును దాఖలు చేసినట్లు ఆ వర్గాలు తెలిపాయి. సీబీఐ, ఈడీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఈ నెల 13న చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించే అవకాశం ఉంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై వచ్చే వారం ఇదే విధమైన ఫిర్యాదు దాఖలయ్యే అవకాశం ఉంది

Advertisement

తాజా వార్తలు

Advertisement