Tuesday, April 30, 2024

ఎపిలో ఏప్రిల్ ఒక‌టి నుంచి ఒంటిపూట బ‌డులు..

అమరావతి: రాష్ట్రంలో ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు. 1 నుంచి 10 తరగతి విద్యార్థులకు ఉదయం 7:45 నుంచి 11:30 వరకు తరగతులు నిర్వ‌హిస్తామ‌న్నారు…. తరువాత మధ్యాహ్న భోజనం కొనసాగుతుంద‌ని, ఆపై ఇళ్ల‌కు పంపివేస్తామ‌ని చెప్పారు.. పాఠశాల నుంచి విద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేర్చటంపై ఉపాధ్యాయులు ప్ర‌త్యేక‌ శ్రద్ద తీసుకోవాలని సూచించారు. ఎండలు, కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు అమలుపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహణ, మాస్క్‌లు ధరించడం, శానిటైజర్ వినియోగం, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సురేష్ ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement