Friday, April 26, 2024

స్థల దాతకు సన్మానం

ఇచ్ఛాపురం, రైతు భరోసా కేంద్రం కోసం ఆరు సెంట్ల భూమిని ఉచితంగా అందించిన రైతును ఘనంగా సన్మానించారు. తేలుకుంచి గ్రామానికి చెందిన రైతు మెరుగు నారాయణరెడ్డి అ తన 6 సెంట్ల భూమిని ఉచితంగా అందించడం తో ఆయన్ను వ్యవసాయాధికారి బి.నర్సింహ మూర్తి రైతులతో కలసి సన్మానించారు. శనివారం మండల వ్యాప్తంగా అన్ని వైస్సార్ రైతు భరోసా కేంద్రాలలో వ్యవసాయ సలహా మండలి సమావేశాలు నిర్వహించారు. ప్రతీనెల మొదటి వారం లో ఈ మండలి సమావేశం జరిపి పంట ల పధకాలు, వైస్సార్ రైతు భరోసా, సమయానుకూల అంశాలపై చర్చిoచారు.
ఈ సమావేశంలో ముఖ్యంగా మే 15 వ తారీఖున రైతుల ఖాతాలకు ప్రభుత్వం విడుదల చేయనున్న 3 వ దఫా వైస్సార్ రైతు భరోసా కోసం రైతుల అభ్యర్ధనలు స్వీకరించి ఏప్రిల్ 15 లోగా సవరణలు చేపట్టేందుకు లబ్దిదారులకు చైతన్యం చేసే కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో హరిపురం, తేలుకుంచి సర్పంచులు చల్ల క్రిష్ణారెడ్డి, పాతిర్ల రాజశేఖర్ రెడ్డి, కార్యదర్శి విజయ, వ్యవసాయ సహాయకులు ప్రవీణ్, దక్కత రామారావు, కొణతాల దివాకర్, వడ్డీని ధర్మరాజు,లoడ చామంతి, వలంటీర్లు మోహన్,నిత్యానంద పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement