Monday, April 29, 2024

ఎంపీ సంతోష్ కు చాద‌ర్ బ‌హుక‌రించిన మ‌త పెద్ద‌లు

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ద‌ర్గా నుంచి వ‌చ్చిన‌ మ‌త పెద్ద‌లు చాద‌ర్ ను బ‌హుక‌రించారు. సంతోష్ తో పాటు సీఎం కేసీఆర్ కుటుంబ స‌భ్యులు ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని ఆశీర్వ‌దించారు. సంతోష్ భ‌విష్య‌త్ లో ఉన్న‌త ప‌ద‌వులు పొందాలని ప్రత్యేక ప్రార్థనలు (దువ్వా) నిర్వహించి నాంపల్లి యూసుఫ్, షరీఫ్ దర్గాకు సమర్పించామని జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ డివిజన్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ కి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి ,TSTS చైర్మన్ చిరుమళ్ళ రాకేష్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement