Thursday, April 25, 2024

రూ.2వేల కోసం స్నేహితుడి దారుణ‌ హ‌త్య

రూ.2వేల కోసం ఓ వ్య‌క్తి త‌న స్నేహితుడినే దారుణంగా హ‌త‌మార్చిన ఘ‌ట‌న‌ హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. న‌గ‌రంలోని ముషీరాబాద్ ఫకీర్‌వాడలో కేవలం రూ.2వేల కోసం మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి స్నేహితుడినే హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సోనూ(27) అనే వ్యక్తి ఆరేళ్ల క్రితం హైదరాబాద్‌కు బ్ర‌తుకుదెరువు కోసం వచ్చాడు. ముషీరాబాద్‌లో నివాసముంటూ కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి స్థానికంగా ఉండే మటన్‌షాపు అల్తాఫ్ ఖాన్‌తో పరిచయం ఏర్పడడంతో వారిద్దరూ స్నేహితులుగా మారారు. అయితే ఓ రోజు సోనూ తన స్నేహితుడు అల్తాఫ్‌కు రూ.2వేలు అప్పుగా ఇచ్చాడు. ఈ నేపథ్యంలో వాళ్లిద్దరూ కలిసి మద్యం సేవించారు. ఆ సమయంలో తాను అప్పుగా ఇచ్చిన రూ.2వేలు ఇవ్వాలని అల్తాఫ్‌ను సోనూ అడ‌గడంతో వాళ్లిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్త గొడవగా మారి అల్తాఫ్ కోపంతో తన మటన్ షాపులోని కత్తితో సోనూ గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. హత్య చేసిన అనంతరం నిందితుడు పోలీసుల ముందు లొంగిపోయాడు. పోలీసులు ఈ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement