Thursday, April 25, 2024

Radhe Shyam: నా చావుకి వారే కారణం: ప్రభాస్ ఫ్యాన్ సూసైడ్ నోట్

సినీ హీరోలపై అభిమానం హద్దులు దాటుతోంది. అభిమానం ముసుగులో కొంద‌రు చేసే పనులు హీరోలకు ఇబ్బంది పెడుతున్నాయి. తాజాగా ప్ర‌భాస్ అభిమాని ఒకరు రాధే శ్యామ్ అప్ డేట్స్ ఇవ్వ‌డం లేదని సూసైడ్ నోట్ రాసారు. యూవీ క్రియేషన్స్ తన చావుకి కారణమని చెప్పడంతో పాటు సదరు నిర్మాణ సంస్థను, ప్రభాస్ ను ట్యాగ్ చేశాడు. ప్ర‌స్తుతం ఈ లేఖ సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారింది.

‘’సార్.. ఇంతవరకు ఒక లెటర్ కూడా రాయని నేను సూసైడ్ నోట్ రాస్తానని కలలో కూడా అనుకోలేదు. మీరు అప్‌డేట్స్ ఇవ్వకపోవడం వల్ల రాయక తప్పడం లేదు. కనీసం నా చావు చూసైనా రాధేశ్యామ్ అప్‌డేట్ ఇస్తారని అనుకొంటున్నాను. చాలా రోజులు వేచి చూసేలా చేశారు. మేము వెయిట్ చేశాం. ఇక చాలు సార్. నా చావుకి కారణం యూవీ క్రియేషన్స్ టీమ్, డైరెక్టర్ రాధాకృష్ణ మాత్రమే. ఈ యూనిట్‌కు చిన్న మనవి.. ఫ్యాన్స్ ఎమోషన్స్‌తో ఆడుకోవద్దు.. ఇట్లు.. రెబెల్ స్టార్ ఫ్యాన్” అని లేఖ‌లో పేర్కొన్నాడు. మరోవైపు “రాధేశ్యామ్” మూవీని వచ్చే ఏడాది జనవరి 14న విడుదల చేయాలని మూవీ టీం సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ ఆశిస్తున్నా అభిమానుల ఆశలు నిరాశ ఎదురవుతోంది.

https://twitter.com/Vamsi48324621/status/1458766850406313984

ఇది కూడా చదవండి: తెలంగాణలో మరో ఉపఎన్నిక.. బీజేపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్య


లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి 

- Advertisement -

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement