Sunday, April 28, 2024

న‌టుడు కార్తీక్ ర‌త్నం నిశ్చితార్థం – హాజ‌ర‌యిన న‌వీన్ చంద్రం

న‌టుడు కార్తీక్ ర‌త్నం నిశ్చితార్థం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి హీరో న‌వీన్ చంద్ర హాజ‌ర‌య్యాడు. హైదరాబాద్ కు చెందిన యువతిని అతడు వివాహం చేసుకోబోతున్నాడు. శనివారం హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్ లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వారి వివాహ నిశ్చితార్థం జరిగింది. థియేటర్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను ప్రారంభించిన కార్తీక్ రత్నం.. ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాలో హీరోగా పరిచయమయ్యాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ప్రేక్షకుల మన్ననలను అందుకుంది. ఆ తర్వాత నారప్ప సినిమాలో నటించి మెప్పించాడు. ఆ తర్వాత న‌టించిన‌ అర్ధశతాబ్దం సినిమా మిశ్రమ ఫలితాలనిచ్చింది. నితిన్ ‘చెక్’, ఇటీవల విడుదలైన ‘రౌడీ బాయ్స్’ సినిమాలోనూ నటించాడు. హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన కార్తీక్ సీఏ కోర్సును మధ్యలోనే ఆపేసి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కాగా, కేరాఫ్ కంచరపాలెం సినిమాను తమిళంలో ‘కేరాఫ్ కాదల్’ పేరుతో రీమేక్ చేశారు. ఆ సినిమాలోనూ కార్తీక్ రత్నం లీడ్ రోల్ పోషించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement