Saturday, May 4, 2024

బీజేపీలో విలీనం కానున్న యువ తెలంగాణ

యువ తెలంగాణ పార్టీ భారతీయ జనతా పార్టీలో విలీనం కానుంది. ఈ నెల 16వ తేదీన త‌మ పార్టీని బీజేపీలో విలీనం చేయనున్నట్లు ఆ పార్టీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి, రాణి రుద్రమలు తెలిపారు. జిట్టా బాలకృష్ణారెడ్డి యువ తెలంగాణ పేరిట తెలంగాణలో పార్టీని స్థాపించారు. అయితే ఏ ఎన్నికల్లోనూ పెద్దగా ప్రభావం చూపలేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో ఈ విలీన కార్యక్రమం జరగనుంది. అయితే టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా తాము పార్టీని పెట్టామని, కేసీఆర్ ను అందరం కలసి ఇంటికి పంపాల్సిన సమయం ఆసన్నమైందని జిట్టా బాలకృష్ణారెడ్డి తెలిపారు. అందుకే బీజేపీలో తమ పార్టీని విలీనం చేయనున్నట్లు ఆయన తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement