Friday, April 26, 2024

ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న వైఎస్ షర్మిల

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల ఈ రోజు ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష చేయాలని షర్మిల చేపట్టిన విషయం తెలిసిందే..దానిలో భాగంగానే ఇవాళ షర్మిల ఖమ్మం జిల్లాలోని పెనుబ‌ల్లి మండ‌లంలోని గంగాదేవిపాడు గ్రామానికి చెందిన నిరుద్యోగి నాగేశ్వ‌ర‌రావు కుటుంబాన్ని కలిసి పరమార్శించారు. నాగేశ్వ‌ర‌రావు ఉద్యోగం రాక‌పోవ‌డంతో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. దీంతో వారి కుటుంబానికి తాను అండగా ఉంటానని షర్మిల వారికి హామీ ఇచ్చారు. ఇక రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని షర్మిళ మరోసారి డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి : త్వరలోనే భారత్ లోకి మోడెర్నా వ్యాక్సిన్..

Advertisement

తాజా వార్తలు

Advertisement