Thursday, March 28, 2024

త్వరలోనే భారత్ లోకి మోడెర్నా వ్యాక్సిన్..

భారత్ లోకి మోడెర్నా వ్యాక్సిన్ డోసులను అందుబాటులోకి రానున్నాయి. కోవాక్స్ కార్య‌క్ర‌మం ద్వారా ఈ వ్యాక్సిన్లు  దిగుమ‌తి కాబోతున్నాయి.  WHO అంద‌రికీ వ్యాక్సిన్ అందుబాటులో ఉండాల‌నిచెప్పి కోవాక్స్ అనే సంస్థ‌ను ఏర్పాటు చేసింది. ఇందులోని స‌భ్య‌దేశాల‌కు వ్యాక్సిన్‌ను ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ అందిస్తున్న‌ది.  ఇందులో భాగంగా కోవాక్స్ నుంచి 7.5 మిలియ‌న్ డోసులు భార‌త్‌కు రాబోతున్నాయి.  అయితే, ఈ వ్యాక్సిన్ డోసులు ఎప్పుడు భార‌త్‌కు చేరుకుంటాయి అనే విష‌యంపై క్లారిటీ రావాల్పి ఉన్న‌ది.  విదేశీ టీకా సంస్థ‌ల‌కు సంబందించి ఇండెమ్నిటీ క్లాజ్‌పై స్ప‌ష్ట‌త వ‌స్తేనేగాని టీకాలు భార‌త్‌లో ఎప్పుడు అందుబాటులోకి వ‌స్తాయి అనే విష‌యంపై క్లారిటీ వ‌స్తుంది. అయితే, మోడెర్నా టీకాను భార‌త్‌లో అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తించారు. మోడెర్నా డోసుల దిగుమ‌తుల‌పై కేంద్రం ఎప్ప‌టిక‌ప్పుడు ఆ సంస్థ‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్టు నీతీ ఆయోగ్ స‌భ్యులు డాక్ట‌ర్ వీకే పాల్ తెలిపిన సంగ‌తి తెలిసిందే. 

ఇది కూడా చదవండి : పార్లమెంట్ లో పెగాసస్ పై చర్చపెట్టాలని విపక్షాలు ఆందోళన..ఉభయసభలు వాయిదా

Advertisement

తాజా వార్తలు

Advertisement