Monday, April 29, 2024

కరోనా బాధ్యతను కేసీఆర్ దొర వదిలించుకున్నారు: షర్మిల

తెలంగాణ సీఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా మరోసారి విమర్శలు గుప్పించారు. కరోనా బాధ్యతను కేసీఆర్ దొర వదిలించుకోవడంతో… ప్రజల మీద ప్రతి రోజు రూ. 150 కోట్ల భారం పడుతోందని ఆమె అన్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల అడ్డగోలు దోపిడీతో ప్రజల బతుకులు బజారున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నోడు పేదోడైపోతున్నాడని… కాస్తోకూస్తో సంపాదించినోడు ప్రాణాలు నిలుపుకోవడానికి ఉన్నదంతా ఖర్చు పెడుతున్నాడని షర్మిల తెలపారు. ‘’ఏమీ లేనోడు అప్పులు చేసి ఆగమవ్వడమో… ఉన్న భూమి జాగాను అమ్ముకుని, అప్పులు ఎట్లా కట్టుడో చంద్రశేఖరా అని మొత్తుకుంటున్నారు. అయ్యా కేసీఆర్ సారూ… ఇప్పటికైనా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి… పేదలు అప్పుల బారిన పడుకుండా చూడు’ అని షర్మిల ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement