Saturday, April 27, 2024

చెవిటోని ముందు శంఖం ఊదినట్టే : సీఎం కేసీఆర్‌పై షర్మిల ఫైర్

తెలంగాణ సీఎం కేసీఆర్‌ పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మరోసారి మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు అంశంపై కేసీఆర్ పై ఆమె మండిపడ్డారు. ఢిల్లీ రాజకీయాలు చేసే దొరగారికి ఇక్కడి రైతుల చావులు, నేతన్నల ఆత్మహత్యలు కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టిన పెట్టుబడి రాక, పండిన పంట కళ్ళ ముందు కొట్టుకుపోతుంటే, అప్పులు తీరక గుండెలు ఆగిపోతుంటే కేసీఆర్ కి మాత్రం కనిపించడం లేదని మండిపడ్డారు.

‘’దొరా.. పంటలు కొనండి అని గుండెలు ఆగేలా మొత్తుకొంటున్నా.. కేసీఆర్ కు మాత్రం చెవిటోని ముందు శంఖం ఊదినట్టే ఉంది‘’ అని షర్మిల ఎద్దేవా చేశారు. ‘’ఆఖరి గింజ వరకూ కొంటానన్న దొర గారు, ఇప్పటికైనా మీ డ్రామాలు పక్కన పెట్టి.. కాళ్ళు పట్టుకొంటున్న రైతులు, గల్లా పట్టుకోకముందే రైతుల ధాన్యాన్ని తక్షణమే కొనాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని షర్మిల వ్యాఖ్యానించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement