Sunday, April 28, 2024

మార్చి 1నుంచి వైఎస్ ష‌ర్మిల ప్ర‌జా ప్ర‌స్థానం పాద‌యాత్ర

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మార్చి నెల 1వ‌తేదీ నుంచి ప్రజా ప్రస్థానం పాదయాత్ర నిర్వహించనున్నారు. గత ఏడాది నవంబర్ 9న స్థానిక సంస్థలు, కరోనా నిబంధనల కారణంగా ఆమె చేప‌ట్టిన‌ పాదయాత్రకు బ్రేక్ పడింది. అయితే క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో రాష్ట్రంలోని నల్గొండ జిల్లా కొండపాక గూడెం నుంచి షర్మిల పాదయాత్ర మొదలు పెట్టనున్నారు. అయితే ఈ పాద‌యాత్ర‌ ఎన్నికల వరకూ 4 వేల కిలోమేటర్ల వ‌ర‌కు చేయాలని షర్మిల నిర్ణయించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement