Monday, April 29, 2024

Breaking: మద్యం మత్తులో యువతి.. అర్ధనగ్నంగా రోడ్డుపై హల్ చల్ !

శంషాబాద్, (ప్రభ న్యూస్) : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఓ యువతి ఆగమాగం చేసింది. డక్కన్ పార్క్ హోటల్ వద్ద బాగా తాగి.. మద్యం మత్తులో అర్ధనగ్నంగా హల్ చల్ చేసింది. భువనేశ్వర్ కు చెందిన రష్మిక రౌత్, లక్ష్మికాంత్ ఇద్దరు ప్రేమికులు.

ఇండిగో విమానంలో ఇవ్వాల (శుక్రవారం) ఉదయం హైదరాబాద్ వచ్చి డక్కన్ పార్క్ హోటల్ లో రూమ్ బుక్ చేశారు.
ఆ రూమ్​లో ఇద్దరు ఫుల్లుగా మద్యం తాగారు. అనంతరం ఇద్దరి మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తోంది. కాగా, ఈ గొడవ కాస్త ముదరడంతో ఇద్దరు భయటకు పరుగులు తీశారు.

అయితే.. యువతి ఒంటిపై బట్టలు తీసేసి రోడ్డుపై అలాగే పరుగులు తీసింది. ఇట్లా అర్ధనగ్నంగా ఉన్న యువతిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు యువతికి బట్టలు వేయించి పోలీసు స్టేషన్​కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement