Thursday, May 2, 2024

శంషాబాద్ ఎయిర్ పోర్టులో యువతి హల్ చల్

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఒక యువతి మద్యం మత్తులో ఉద్యోగిపై దాడికి దిగింది. ఇండిగో ఎయిర్ లైన్స్ లో వస్తున్న ప్రయాణికురాలు అతిగా మద్యం తాగి ఇండిగో ఉద్యోగిపై దాడికి దిగింది. మద్యం మత్తులో సుబర్నా పాండే అనే యువతి వీరంగం సృష్టించిన ఘటన తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఇండిగో ఎయిర్‌లైన్స్ ఉద్యోగితో సుబర్నా పాండే దురుసుగా ప్రవర్తించింది. అంతేకాకుండా ఆ ఎయిర్ లైన్స్ ఉద్యోగిని బూతులు తిడుతూ దాడికి యత్నించింది. అరగంట పాటు గేట్ నెంబర్ 24 సుబర్నా పాండే వద్ద నానా హంగామా చేసింది. యువతిని ఎయిర్‌పోర్ట్ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని, ఎయిర్‌పోర్ట్ పోలీసులకు అప్పగించారు. అయితే ఆ యువతి హైదరాబాద్ నుండి ఢిల్లీ వెళుతున్నట్లు తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement