Monday, April 29, 2024

కొత్త కారుతో యువ‌తి హ‌ల్ చ‌ల్.. ఓ వ్య‌క్తి మృతి

కొత్త కారుతో ఓ యువ‌తి హ‌ల్ చ‌ల్ సృష్టించింది. మితిమీరిన వేగంతో కారును న‌డిపి ఒక‌రి మృతికి కార‌ణ‌మ‌యింది. ఈ సంఘ‌ట‌న సికింద్రాబాద్‌లోని అల్వాల్‌లో చోటు చేసుకుంది.. ఈ ప్రమాదంలో రోడ్డుపక్కన ఉన్న చెరుకు రసం బండి, టిఫిన్‌ సెంటర్‌, బైక్‌ ధ్వంసమయ్యాయి. కానాజి గూడకు చెందిన శివాని అనే యువతి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తుంది. రాత్రి తన కొత్త కారుతో బయటకు వెళ్లింది.. తిరుమలగిరి నుంచి మిలిటరీ డెయిర్‌ ఫారం వైపు వెళ్తుండ‌గా. ఈ క్రమంలో అదుపుతప్పిన కారు.. ఓ వ్యక్తిని ఢీకొట్టింది. తర్వాత రోడ్డు పక్కన ఉన్న చెరుకు బండి, టిఫిన్‌ సెంటర్‌కు కగిలి.. కరెంటు స్తంభానికి ఢీకొట్టి ఆగింది. అయితే అక్కడే ఆగి ఉన్న ఓ స్కిగ్గీ బాయ్‌కు కారు తగలడంతో అతడు చనిపోయాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతి మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement