Saturday, May 4, 2024

సాయిబాబా ఊరేగింపు.. శివలింగాలకు లక్ష పుష్పార్చన

కరీంనగర్, సాయి నామస్మరణతో నగర వీధులు పులకించిపోయాయి. ఇటు పరమేశ్వరుని, అటు సాయిబాబాను జపిస్తూ శివలింగాలను ఊరేగింపుగా తీసుకు వెళ్ళి శివాలయంలో ప్రత్యేక పూజలు జరిపించారు. కేరళ రాష్ట్రంలో ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి ఆనవాయితీగా జరుపుకునే కార్యక్రమాన్ని కరీంనగర్ లోని విద్యానగర్ కి చెందిన డాక్టర్ అక్షిత ఆధ్వర్యంలో జరిగింది. పంచలోహాలతో తయారు చేసిన 21 శివలింగాలకు 11 రోజుల పాటు దీపారాధనతో కూడిన పూజలు చేశారు. అనంతరం భక్తులు పల్లకిలో శివలింగాలను ఊరేగింపుగా శివా ర్చన భజన చేస్తూ శివాలయం వరకు సాగారు. పల్లకి మోసే భక్తులు పల్లకిని మోయడం ద్వారా తమ కష్టాలను భగవంతుడు తీరుస్తారనే నమ్మకంతో ఈ కా ర్యక్రమం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శివాలయంలో అభిషేకం, లక్ష పుష్పా ర్చన, లింగార్చన అనంతరం డాక్టర్ అక్షిత నివాసంలో యజ్ఞం నిర్వహించారు. అ నంతరం పల్లకి సేవలో పాల్గొన్న భక్తులకు శివలింగాలను అందజేశారు. ఈ కా ర్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement